భారతదేశం, మే 10 -- దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నారు రాజ‌మౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి తెలుగు మూవీగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి, ఈగ‌, మ‌గ‌ధీర‌తో పాటు మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ ప‌రంగా ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పాయి. నేష‌న‌ల్ అవార్డుల‌తో పాటు అనేక పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న‌ది.

స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ మిన‌హా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అన్ని సినిమాల‌కు ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించ‌డం గ‌మ‌నార్హం. . విజ‌యేంద్ర ప్ర‌సాద్ టాలీవుడ్‌లో అగ్ర ర‌చ‌యిత‌ల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.

జాన‌కి రాముడు సినిమాతో క‌థా ర‌చ‌యిత‌గా విజ‌య...