భారతదేశం, మే 18 -- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రాజ్యాంగం ప్రాముఖ్యతపై మాట్లాడారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. మూలస్తంభాలు కలిసి పనిచేయాలని ఉద్ఘాటించారు. 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా ఆధ్వర్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం, రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశం బలపడటమే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని సీజేఐ పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ గానీ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ గానీ సర్వోన్నతమైనవి కావని భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని అన్నారు. మూడు అవయవాలు రాజ్యాంగం ప్రకారమే పనిచేయాల్సి ఉందన్నారు. దేశ మౌలిక నిర్మాణం బలంగా ఉందని, రాజ్...