భారతదేశం, మే 27 -- నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి అవ‌కాశ‌ల క‌ల్పన కోసం అమలు చేస్తున్న 'రాజీవ్ యువ వికాసం' ద్వారా జూన్ 2న ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాలు అంద‌చేయునున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రూ. ల‌క్ష లోపు యూనిట్లకు మొద‌టి ద‌శ‌లో ప్రొసిడింగ్స్ ఇవ్వాల‌ని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం రోజు ఎంపికైన ల‌బ్దిదారుల‌కు మంజూరు పత్రాల‌ను అందించనున్నారు.

"నిరుద్యోగ యువ‌త‌కు ఇచ్చిన‌ మాట‌ను నిల‌బెట్టుకున్న ప్రభుత్వం మాది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాల‌ను క‌ల్పిస్తూనే..మ‌రో వైపు స్వయం ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాం. మొద‌టి విడ‌త‌లో రూ. ల‌క్ష లోపు యూనిట్లకు ప్రొసిడింగ్స్ ఇవ్వాల‌ని ప్రభుత్వ నిర్ణయించింది.

ద‌ర‌ఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ యువ వికాసాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి"-...