భారతదేశం, మే 19 -- 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకం ప్రారంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జల వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని అన్నారు.

అచ్చంపేట నియోజకవర్గంలో 'ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం' ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని అన్నారు. నల్లమల డిక్లరేషన్‌ అమలుచేసి గిరిజనులకు ఫలితాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకుంచే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారని, ఎంతో మందిపై పోలీసు కేసులు పెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

"దేశంలోనే గొప్ప కార్యక్రమం "ఇంద...