భారతదేశం, మే 27 -- రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందుగానే నిర్ణయించిన ప్రకారం.. జూన్‌ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన 8 అంశాలు ఇలా ఉన్నాయి.

1.రాజీవ్‌ యువవికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 28తో ముగియనుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన కమిటీలు.. ప్రాథమికంగా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి.

2.బుధవారం నాటికి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది జాబితాలను ఖరారు చేయనున్నారు. 2025-26 ఏడాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయడంతోపాటు.. మూడు నెలల్లో విడతల వారీగా ...