భారతదేశం, ఫిబ్రవరి 11 -- టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అతడు మరో ఆసక్తికరమైన మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అదే 'మృత్యుంజయ' (Mrithyunjay). ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

బుధవారం (ఫిబ్రవరి 11) మృత్యుంజయ మూవీ టీమ్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. విశేషమేమిటంటే.. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన 'ఎక్స్' అకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను లాంచ్ చేశాడు. అంతేకాకుండా టీజర్ చాలా బాగుందంటూ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జక్కన్న సపోర్ట్ దొరకడ...