భారతదేశం, మే 21 -- సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ చేస్తున్నారనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడిక ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీ రోల్ ప్లే చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి, మహేష్ బాబు మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇప్పటికే ఇతర స్టార్లు కూడా భాగమయ్యారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమాలో విక్రమ్ కీ రోల్ ప్లే చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మ...