భారతదేశం, నవంబర్ 13 -- దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి కలిసి పనిచేయబోతున్నారనే ప్రకటనతో అభిమానులు ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి నిరాశపరిచే వార్త వెలువడింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'తలైవా 173' చిత్రం నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నాడు.
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతలోనే అతడు తప్పుకున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. బ్లాక్బస్టర్ ఎంటర్టైనర్లను అందించడంలో సుందర్ సి పేరుగాంచాడు. దీంతో అతడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రకటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో అతడు రజనీకాంత్తో కలిసి 'అరుణాచలం' వంటి హిట్ చిత్రాన్ని కూడా అందించాడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.