భారతదేశం, ఫిబ్రవరి 17 -- రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉపవాస మాసంలో సాయంత్రం 4 గంటలలోపు కార్యాలయం నుండి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉందని ప్రకటించింది.

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(GAD) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారు తమ ఉపవాసం విరమించడానికి, మతపరమైన ప్రార్థనలు చేయడానికి త్వరగా కార్యాలయాన్ని వదిలి వెళ్ళవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పని చేయాల్సి రావచ్చు.

ఈ మేరకు పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద...