Hyderabad, జూన్ 21 -- మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యోగా గొప్పదనం గురించి వివరించారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. "యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత కావాలి. యోగా ఆంథెమ్ సాంగ్‌ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖలో ఆయన యోగా డే సెలబ్రేషన్స్‌కు హాజరవు...