భారతదేశం, మే 12 -- ూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలాంటి యూపీఐ సేవల్లో అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. చెల్లింపులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ సమస్య మొదలైందని అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ నివేదించింది. రాత్రి 7 గంటలకు అత్యధికంగా 913 ఫిర్యాదులు నమోదయ్యాయి. యూపీఐ సేవలు నిలిచిపోవడం ఈ నెలలో ఇది మూడోసారి. అయితే ఇప్పుడు ఈ సర్వీసులు పనిచేయడం ప్రారంభించాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య యూజర్లు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.

డౌన్ డిటెక్టర్ ప్రకారం, సమస్యను ఎదుర్కొంటున్న 31 శాతం మంది చెల్లింపులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. 47 శాతం మంది నగదు బదిలీలో, 21 శాతం మంది కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేమెంట్ ఫెయిల్యూర్ లేదా పేమెంట్ ఆలస్యం కావడంపై దేశవ్యాప్తంగా య...