భారతదేశం, జూన్ 12 -- యూపీఐ లావాదేవీలపై MDR(మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేయబడుతుందనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలించడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తున్నారనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పింది.

యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రూ.3,000 లేదా రూ.5,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం ఛార్జీలు విధించవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకోసం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టవచ్చని వైరల్ అయింది. వాస్తవానికి పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సు మేరకే ఈ క్లెయిమ్ చేశార...