భారతదేశం, మార్చి 3 -- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అబుదాబిలో నాలుగు నెలల పసికందును హత్య చేసిన కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన షహజాదీ ఖాన్ అనే మహిళను ఫిబ్రవరి 15న ఉరితీశారు. మహిళ భద్రత కోసం తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సోమవారం దిల్లీ హైకోర్టులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ పరిణామంపై జస్టిస్ సచిన్ దత్తా మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల పసికందును చంపిన కేసులో యూపీలోని బందా జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళకు అబుదాబిలో మరణశిక్ష విధించారన్నారు.
దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపిస్తూ.. ఫిబ్రవరి 15న ఉరి తీశారు. మార్చి 5న ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. తన కుమార్తె యోగక్షేమాలు తెలుసుకోవాలని షహజాదీ ఖాన్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.