భారతదేశం, జూన్ 12 -- అల్లరి నరేష్ కామెడీ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' మరో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన 13 నెలల తర్వాత మరో ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజే (జూన్ 12) రెండో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టింది. మ్యాట్రిమోనీల పేరుతో జరిగే మోసాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా అందించారు.

అల్లరి నరేష్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ గురువారం మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 2024 మే 3న ఈ సినిమా రిలీజైంది. అదే నెల 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన 13 నెలల తర్వాత మరో ఓటీటీ ఈటీవీ విన్ లో అడుగుపెట్టింది.

అల్లరి నరేష్ మూవీ అంటే మినిమం కామెడీ గ్యారెంటీ. ఇటీవల కాలంలో డిఫరెంట్ స్టోరీస్ మూవీస్ చేస్తున్న ...