భారతదేశం, ఏప్రిల్ 16 -- తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తేదీలను ప్రకటించటంతో పాటు ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించింది.

సరస్వతీ నది పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగానే పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్‌ పోర్టల్, యాప్‌ను తీసుకువచ్చారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....