భారతదేశం, మే 11 -- ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. తిరిగి జూన్ 16 నుంచి ఏపీ హైకోర్టు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. అయితే అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.

మొదటి దశలో మే 15, 22, 29 తేదీల్లో, రెండో దశలో జూన్ 5, 12 తేదీల్లో అత్యవసర కేసుల విచారణలు జరగనున్నాయి. మే 15, 22 తేదీల్లో జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ లో అత్యవసర కేసులను విచారిస్తారు.

మే 29న జస్టిస్ ఎన్. హరినాథ్, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ లో, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ లో కేసుల విచారణ చేపట్టనున్నారు.

జూన్ 5, 12వ తేదీల్లో...