భారతదేశం, మే 26 -- నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. గతేడాది జూన్ 2న నైరుతి రుతుపవనాలు ఏపీకి ప్రవేశించాయి.

నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. చాలా కాలం తర్వాత మే నెలలోనే రాష్ట్రానికి నైరుతి పలకరింపు శుభ పరిణామం అన్నారు. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం కావాలని.... రైతులకు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు.

వ్యవసాయాధారిత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతన్న బాగుంటాడు. అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం స...