భారతదేశం, డిసెంబర్ 27 -- మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి మహా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేపట్టింది.

మొత్తంగా చూస్తే గతంలో చూసిన మేడారానికి. ప్రస్తుతం చూడబోయే మేడారానికి చాలా తేడాలుండనున్నాయి. గద్దెల విస్తరణలో భాగంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతరలోపే నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆ దిశగానే కాంట్రాక్టర్లు కూడా పనులు జరుపుతున్నారు జిల్లా మంత్రులు కూడా ఎప్పకికప్పుడు సమీక్షిస్తుండగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....