భారతదేశం, జనవరి 25 -- మేడారం జాతర సందర్భంగా తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో సహాయపడటానికి తెలంగాణ పోలీసులు వోడాఫోన్ మద్దతుతో క్యూఆర్ కోడ్ ఆధారిత చిల్డ్రన్ ట్రాకింగ్, మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్‌బ్యాండ్‌లను ప్రవేశపెట్టారు. గతంలో లేని విధంగా చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ రిస్ట్ బ్యాండ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

రిస్ట్‌బ్యాండ్‌లు క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉంటాయి. స్కాన్ చేసినప్పుడు అవి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలను చూపిస్తాయి. జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్లను ఎంటర్ చేస్తారు. ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే.. స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. తల్లిదండ్రుల వివరాలు అగుపిస్తాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించవచ్చు. వీటి ద్వారా వేగంగ...