భారతదేశం, సెప్టెంబర్ 8 -- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పనులకు ఉస్మాన్‌సాగర్ వద్ద శ్రీకారం చుట్టారు. రూ.7360 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జరగనున్నాయి. రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచి నీటితో నింపుతారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీ పునరుజ్జీవనం కోసం కేటాయిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయిస్తారు. ఈ మార్గంలో ఉన్న ఏడు చెరువులను కూడా నింపుతారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) మోడల్ కింద ఈ ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలలో పూర్తవుతుంద...