Hyderabad, మే 9 -- ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఒత్తిడి వల్ల మెదడు తీవ్రంగా అలసిపోతుంది. దీనివల్ల మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

మెదడులోని నరాలలో ఫ్లాక్ పేరుకుపోవడం వల్ల ఆ నరాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంటే నరాలలో అడ్డంకులు ఏర్పడుతాయి.దీనివల్ల మెదడులోని రక్తనాళాలు పగిలిపోతాయి. ఒక్క రక్తనాళం పగిలినా చాలు... బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. కాబట్టి సిరల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తలనొప్పి ఆకస్మికంగా పెరిగిపోవడం, మాట్లాడడంలో ఇబ్బంది పడడం, దృష్టి మసకబారడం, తరచూ తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ సంకేతాలు మెదడు వ్యాధులను సూచిస్తాయి. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి తగిన చికిత్సలు తీసుకోవాలి.

ఎప్పటికప్పుడు మెదడును రిలాక్...