భారతదేశం, ఏప్రిల్ 22 -- కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మృతి కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఓం ప్రకాశ్ భార్య పల్లవి.. గొంతు కోస్తే ఓ వ్యక్తి ఎలా చనిపోతాడనే సమాచారాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసిందని తెలుస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకుందని పోలీసులు వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. విచారణ జరుపుతున్నారు.

మెడ దగ్గర సిర, రక్తనాళాలు తెగిపోయినప్పుడు ఒక వ్యక్తి ఎలా చనిపోతాడో తెలుసుకోవడానికి పల్లవి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసింది. చంపడానికి 5 రోజుల ముందు పల్లవి ఈ సెర్చింగ్ చేసింది. కత్తితో పొడిచే ముందు ఓం ప్రకాశ్ ముఖంపై పల్లవి కారంపొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారని పోలీసు వర్గాలు తెలిపాయి. తీవ్ర వాగ్వాదం తర్వాత పల్లవి ప్రకాశ్ ముఖంపై కారంపొడి చల్లింది. ఆవేశంతో ప్రకాశ్ అటూ ఇటూ తిరుగుతుండగా పల్లవి ...