భారతదేశం, మే 2 -- ప్రయాణికులకు మెట్రో బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలో మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా ఛార్జీలను పెంచేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కసరత్తు చేపట్టింది. వరుస నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలుస్తోంది.

చాలా రోజులుగా ప్రయాణికుల రాకపోకల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. తరచూ 4.8 లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు సిటీ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. దీంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు కూడా మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్ల...