భారతదేశం, జూన్ 10 -- బాక్సాఫీస్ దగ్గర మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే చాలా సార్లు మెగా హీరోలు, నందమూరి హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. కానీ ఈ సారి సమరం మరింత ప్రత్యేకం కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ 'ఓజీ', నందమూరి బాల‌కృష్ణ‌ సినిమా 'అఖండ 2 తాండవం' ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కల్యాణ్ ఓజీ, బాల‌కృష్ణ‌ అఖండ 2 సినిమాలు 2025 దసరా రోజు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ మూవీస్ థియేటర్లకు రాబోతున్నాయి. ఓజీ రిలీజ్ డేట్ ను మే 25న మేకర్స్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 25న థియేటర్లకు ఓజీ వచ్చేస్తున్నాడని ప్రకటించేశారు. తాజాగా అఖండ 2 నుంచి పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేసిన ఆ మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 25నే అఖండ 2ను థియేటర...