భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా పంచాయతీలు గెలిచారు. మూడో విడతలో భాగంగా 3752 గ్రామ పంచాయతీలకు, 28410 వార్డులకు పోలింగ్ జరగ్గా.. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది బరిలో నిలిచారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేశారు. సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 50,56,344 మంది అర్హత కలిగిన ఓటర్లలో 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని 85.77 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన జరిగిన విషయం తె...