భారతదేశం, ఏప్రిల్ 22 -- ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బచావో కర్రెగుట్టలు పేరుతో.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టల వైపు ఆదివాసులు రావద్దు అంటూ.. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు.

ములుగు జిల్లా కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కర్రెగుట్టలను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టల ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి నుండి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వెంకటాపురం మండలంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అడవుల్లోకి దాదాపు 2 వేల మంది కూబింగ్ కోసం వెళ్లినట్టు తెలుస...