భారతదేశం, మే 28 -- ఏపీ ఈఏపీ సెట్‌ 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. బుధవారం ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన కీ విడుదల చేస్తారు.

జేఎన్టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్‌ 2025 మంగళ వారంతో ముగిసినట్టు ఈఏపీ సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తోలినాకె, ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం దరఖాస్తు చేసిన వారిలో 2,64,840 (94.38%) మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, పార్మసీ విభాగాల్లో 92శాతం మంది హాజరు అయ్యారు.

ఈఏపీ సెట్‌ 20225 ఇంజనీరింగ్‌ పరీక్షకు మొత్తం 2,80,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840మంది పరీక్షలకు హాజరయ్యారు. 94.38శాతం మంది హాజరైనట్టు అధ...