Hyderabad, మే 17 -- ఆసియాలోనే రిచెస్ట్ వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు. వారిలో ఈషా అంబానీ ఒకరు. ఈమె రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ముఖ్యమైన పదవిలో ఉన్నారు.ఈమె 2018లో ఆనంద్ పిరమాల్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారిలో పాపకి ఆదియా, కొడుకు కృష్ణ అని పేరు పెట్టారు.

ఆదియాను ముందుగా స్కూల్లో జాయిన్ చేశారు. ఇటీవలే ముంబైలోని ప్రతిష్టాత్మక కిండర్ గార్డెన్ స్కూల్ అయినా వెస్ట్ విండ్ స్కూల్లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ వెస్ట్ విండ్ స్కూలు కిండర్ గార్డెన్ స్కూలు మాత్రమే. ఈ స్కూల్లో ధనవంతుల పిల్లలనే చేరుస్తారు. ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ మాత్రమే ఇక్కడ ఉంటాయి. 1947లో ఈ వెస్ట్ విండ్ స్కూలు మొదలైంది.

ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కిండర్ గార్డెన్ స్కూల్లో వెస్ట్ వి...