Hyderabad, మే 16 -- ముంబైని ఎప్పటికీ నిద్రపోని నగరంగా పిలుచుకుంటారు. ఏ సమయంలో వెళ్ళినా ముంబై వీధులు కళకళలాడుతూ ఉంటాయి. ముంబైలో చూడదగ్గ ప్రదేశాలు ఎక్కువే.

చరిత్ర ప్రేమికుల దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ ఇష్టపడే వారి వరకు ముంబైని అందరూ సందర్శించవచ్చు. అక్కడ అన్ని రకాల ప్రదేశాలు ఉంటాయి. వాటిని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. మీరు ముంబై వెళ్తే ఖచ్చితంగా చూసి రావాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఇవి చూశాకే ఇంటికి రండి.

ముంబైలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో చౌపట్టి బీచ్ మొదటిది. ఈ బీచ్ ఎప్పుడూ సందర్శకులతో నిండి ఉంటుంది. ఇక సాయంత్రం చూస్తే కనుల పండుగలా ఉంటుంది. వీధి ప్రదర్శనలు, కార్నివాల్ వంటి వాటితో బీచ్ నిండిపోయి కళకళలాడుతుంది. ఎంత చెప్పినా తక్కువే. రకరకాల ఆహారాలు ఇక్కడ దొరుకుతాయి. ముంబైలో వినాయక చవితికి నిమజ్జనాలు చేసే ప్రాంతం ఇక్కడే.

ముంబైలోన...