Telangana,hyderabad, మే 7 -- రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రెడ్డి.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణ పనులపై సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

తెలంగాణలో వచ్చే 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇత‌ర ర‌హదారుల నిర్మాణం, జంక్ష‌న్లు, వాటి మధ్య అనుసంధాన‌త ఉండాల‌ని సూచించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం) కు సంబంధించిన అలైన్‌మెంట్‌ను ప‌రిశీలించిన అనంతరం... ప‌లు మార్పులు సూచించారు.

తెలంగాణకు మరో మణిహారంగా రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిలవనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను 348 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) ...