భారతదేశం, జూన్ 9 -- 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబో రిపీట్ కావడం.. త్రిష, సిలంబరసన్ లాంటి వాళ్లు నటించడం.. యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ రావడం.. ఇలా థగ్ లైఫ్ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తీరా సినిమా థియేటర్లకు వచ్చాక మాత్రం ఊహించని ఫలితం కనిపిస్తోంది. కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో రిలీజ్ కాలేకపోయిన థగ్ లైఫ్ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ముందుగానే వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.149.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింద...