భారతదేశం, మే 4 -- ాలా మంది వివాహిత జంటలు తమ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆదాయం సంపాదించాలని కోరుకుంటారు. మీరు కూడా అందుకోసం చూస్తుంటే.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు నెల నెలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. జంటలు కలిసి ఒక ఖాతాను తెరిచి ఇన్వెస్ట్ చేయాలి. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఈ పథకం ఉత్తమ వడ్డీ రేటును అందిస్తుంది. అధిక రాబడిని సంపాదించాలనుకునే వారికి ఇది సురక్షితమైన పెట్టుబడి పథకం. దీనిలో ఒకసారి పెట్టుబడి పెడితే నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.

ఇది ఒకేసారి పెట్టుబడి పెట్టే పథకం. కాబట్టి మీరు రికరింగ్ డిపాజిట్ ప్లాన్ లాగా నెలవారీ పెట్టుబడి పెట్టవచ్చని అనుకోకండి. ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. మీరు ఒక వ్యక్తిగా అంటే సింగిల్‌గా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. మీ భాగస్వామితో ...