భారతదేశం, ఏప్రిల్ 19 -- తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. జపాన్ పర్యటనలో సీఎం.. అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరం అని ఉద్ఘాటించారు. అందరి అలోచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.

'తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించాం. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉంది. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన ...