Hyderabad, మే 6 -- నందిని గుప్తా... మిస్ వరల్డ్ 2025 పోటీలలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల దేవత. మిస్ ఇండియా 2023 కిరీటం గెలుచుకొని మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అర్హతను దక్కించుకుంది. అందానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే నందిని గుప్తా మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ మన దేశానికి తీసుకొస్తుందో లేదో చూడాలి.

నందిని గుప్తాది రాజస్థాన్‌లోని కోటా. ఈమె వయసు 21. అందంతో పాటు ఆత్మవిశ్వాసం, అంకిత భావం నిండిన పరిపూర్ణ యువతిలా కనిపిస్తుంది. నందిని మిస్ వరల్డ్ 2025 పోటీలలో వందకి పైగా దేశాల నుండి సుందరీమణులు రాబోతున్నారు. వారందరినీ ఓడించి నందిని మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.

నందిని గుప్తా కోటా పట్టణంలో చాలా నిరాడంబరమైన ఫ్యామిలీలో పుట్టింది. ఆమె పుట్టినప్పుడు అది ఒక చిన్న గ్రామం. ఆమె తండ్రి రైతు. తల్లి గృహిణి. నందిని...