భారతదేశం, ఏప్రిల్ 29 -- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరుగుతాయి.

'పోటీల్లో పాల్గొనడానికి వచ్చేవారు.. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలి. మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్య...