భారతదేశం, మే 10 -- ఓ వైపు ఇండియా - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరో వైపు ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ హై టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులకు భద్రతపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. వరంగల్ కోట, వేయి స్థంభాల గుడితో పాటు.. రామప్ప ఆలయం వద్ద వారికి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు మరో నాలుగు రోజుల్లో వరంగల్‌కు రానున్నారు. రెండు టీములుగా 57 మంది వరంగల్ కు రానుండగా.. అందులో 35 మంది నగరంలోని వేయి స్థంభాల గుడి, కోటను సందర్శిస్తారు. మరో 22 మంది ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని విజిట్ చేయనున్నారు. దీంతో భద్రతా లోపాలు తలెత్తకుండా వారికి మూడంచెల పోలీస్ వ్యవస్థతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మంది సిబ్బందితో...