భారతదేశం, మే 27 -- రియల్మీ తన జీటీ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త డివైజ్ రియల్మీ జీటీ 7 మిడ్-ప్రీమియం ధర సెగ్మెంట్ ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెగ్మెంట్ లో ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ నియో 10, వన్ ప్లస్ 13 ఆర్, రాబోయే వన్ ప్లస్ 13ఎస్ మొదలైన పాపులర్ మోడల్స్ ఉన్నాయి.

రియల్మీ జీటీ 7 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999 గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ /512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999. అమెజాన్, రియల్మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా మే 30 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్స్ మే 27 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీ-బుక్ చేసుకున్న వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత స్క్రీ...