భారతదేశం, మే 20 -- తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత భైర‌వం మూవీతో మంచు మ‌నోజ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌మిళ మూవీ గ‌రుడ‌న్‌కు రీమేక్‌గా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మే 30న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. భైర‌వం రిలీజ్ సంద‌ర్భంగా ఈ సినిమాతో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన ఒదిదుడుకుల గురించి మంచు మ‌నోజ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

ఒక సినిమా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌లిశాడు. . డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలని అనుకుంటున్నాడ‌ని చెప్పాడు.ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్‌ విజ‌య్ న‌న్ను క‌లిసి భైర‌వం కథ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇమ్మీడియట్ గా ఓకే చేశాను. డిఫ‌రెంట్ ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా మూవీగా భైర‌వం ఆక‌ట్టుకుంటుంది.

ఇందులో గజపతి వర్మ గా నేను క నిపిస్తా. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్ట‌ర్ ...