భారతదేశం, ఫిబ్రవరి 10 -- గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతిపై, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారింది? తన కూతురు మాల్తీ మేరీని ఏ విలువలతో పెంచుతున్నారు? వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ప్రియాంక చోప్రాతో వివాహం తర్వాత తనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ మతం ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయని, ఇప్పుడు ఇండియానే తనకు ఇల్లులా అనిపిస్తోందని నిక్ జోనస్ అనడం విశేషం. తాజాగా 'సచ్ సంగ్ షో' (Sach Sang Show)లో పాల్గొన్న అతడు.. హిందూ మతం తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరించాడు.

నిక్ మాట్లాడుతూ.. "నాకు ఎప్పుడూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం కావాలని కోరిక ఉండేది. ప్రియాంకను పెళ్లి చేసుకున్నాక అది నెరవేరింది. మొదటిసారి ఇండియా వెళ్ళినప్పుడు, అక్కడ ప్రియాంక కుటుంబంతో...