భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన ముందు లొంగిపోయినట్లు సమాచారం. రేపోమాపో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ టార్గెట్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు ప్రాణాలు కోల్పోగా. మరికొంత మంది పలు రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఇందులో భాగంగానే దేవ్ జీ, రాజిరెడ్డి కూడా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

దేవ్‌జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టు పార్టీకి ఆయన నాయక...