భారతదేశం, ఏప్రిల్ 28 -- ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తమ పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రాయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ ఎందుకు ఈ డిమాండ్ చేశారనే చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం.

'ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఆపరేషన్ క‌గార్ పేరుతో.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ గిరిజ‌నులను ఊచ‌కోత కోస్తున్న‌ారు. ఇది ధ‌ర్మం కాదు. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చ‌ర్చ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వారు ప్ర‌తిపాద‌న పెడుతున్న‌ారు. ఈ సంద‌ర్భంగా నేను కేంద్ర ప్ర‌భుత్వాన్నా కోరుతున్నా.. బ‌లమున్న‌ది అని సంపుకుంట పోవుడు కాదు.. అది ప్ర‌జాస్వామ్యం కాదు. ఆప‌రేష‌న్ క‌గార్‌ను వెంట‌నే ఆపేయండి' అని కేసీఆర్ కోరారు.

'న‌క్స‌లైట్ల‌ను పిలిచి డెమోక్రా...