భారతదేశం, మే 4 -- ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు 10 రోజుల నుంచి సాయుధ బలగాలు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో అయితే.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒకే స్టాండ్ మీద ఉండి.. చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకులతో అమాయకులను చంపినవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్‌. మావోయిస్టులు మందుపాతరలు పెట్టి.. అన్ని పార్టీల నేతలను చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారు. తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదు. కాంగ్...