భారతదేశం, మే 6 -- సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. వివిధ క్యాడర్ లో పనిచేస్తున్న 14మంది సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని వివరించారు. నక్సలిజంలో కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉండటం వల్ల.. వీటిని గమనించిన కొంతమంది సభ్యులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు.

లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరఫున అనేక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఎస్పీ వివరించారు. లొంగిపోయిన వారికి వెంటనే రూ. 25వేల ఆర్థిక సహాయం ఇస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఉపాధి కొరకు దశలవారీగా ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు వివరించారు. తెలంగ...