భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న సమర్పించనున్నారు. ఫిబ్రవరి 15 ఆదివారం కావడం, మహా శివరాత్రి తర్వాత ఫిబ్రవరి 16 సెలవు దినంగా ఉన్నందున, బడ్జెట్‌పై చర్చలు ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగుతాయి. ఫిబ్రవరి 18న చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీ ఉండవు. మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 6, 7న బడ్జెట్‌పై మరోసారి చర్చ ఉండనుంది. ఆ తర్వాత అవసరం మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా లేదా అనేది ని...