భారతదేశం, మే 16 -- ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా.. ఈ నెల 8న జమ్ముకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందారు అగ్నీవీర్‌ మురళీ నాయక్‌. అతని కుటుంబానికి వైసీపీ అండ‌గా నిలిచింది. ఈ నెల 13న వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ముర‌ళినాయ‌క్ కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు. మురళీ నాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.. తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు.

దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని వైసీపీ ప్ర‌భుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించింది. మురళీ నాయక్‌ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు.

తాజాగా జ‌గ‌న్ ఆదేశాల‌తో.. పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు, మ...