భారతదేశం, మే 16 -- భారత న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన, దేశ అత్యున్నత న్యాయస్థానానికి నేతృత్వం వహించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఒక కొత్త కీలక పాత్రను స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు విద్యా రంగంలోకి అడుగుపెట్టారు. దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయమైన నేషనల్ లా యూనివర్సిటీ (NLU), ఢిల్లీలో ఆయన 'విశిష్ట ప్రొఫెసర్' (Distinguished Professor) గా నియమితులయ్యారు.

ఈ నియామకాన్ని ఎన్ఎల్‌యూ ఢిల్లీ ఒక 'పరివర్తనాత్మక అధ్యాయం'గా అభివర్ణించింది. గురువారం తమ అధికారిక X ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఎన్ఎల్‌యూ- ఢిల్లీ ప్రకటించింది.

"భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను విశిష్ట ప్రొఫెసర్‌గా నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి ఆహ్వానించడం మాకు ఎంతో గౌరవం" అని ఆ యూనివర్సిటీ పేర్కొంది. ఈ ప్...