భారతదేశం, మే 20 -- మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పనిచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకవలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ మేడిగడ్డ కుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....