భారతదేశం, మే 20 -- మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పనిచేశారు.

జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ ను విచారణకు రావాలని కమిషన్ సూచించింది. నోటీసులపై 15 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని కోరింది.

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ మేడిగడ్డ కుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తుంది.

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష...