భారతదేశం, జూలై 24 -- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లపై భారీ డొనేషన్లు, ఫీజుల అక్రమాలపై ఆరోపణలు రావటంతో.. ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను గణాంకాల్లో హెచ్చు తగ్గులు ఉండటంతో. ఈ తనిఖీలను చేపట్టినట్లు సమాచారం.

మల్లారెడ్డి కుటుంబ సభ్యులైన ప్రీతి రెడ్డి, భద్రా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి అధికార వర్గాల నుంచి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక గతంలోనూ మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

Published by HT Digital Content Services with permission from HT Telugu....