Hyderabad, మే 13 -- అండాశయ క్యాన్సర్ విషయంలో మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో అండాశయ క్యాన్సర్ ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. అండాశయ క్యాన్సర్ ప్రపంచంలో మహిళలకు వస్తున్న ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్.

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 324,000 మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అంచనా. వీరిలో 2,07,000 మంది చనిపోతున్నారు. అందువల్ల, అండాశయ క్యాన్సర్ తో సంబంధం ఉన్న లక్షణాలు, చికిత్స గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడగలదు. కొన్ని లక్షణాలు శరీరంలో తరచూ కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.

ఈ క్యాన్సర్ సోకినవారిలో కొన్ని రకాల లక్షణాలు అధికంగా ఉంటాయి. నిరంతరం పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. దాన్ని తే...